ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!
Sat Jun 14, 2025 07:02 Politics
100 రూపాయల వస్తువును 20 రూపాయలకే ఇస్తే ఎలా తీసుకోకపోతాం? ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అలాంటి అవకాశమే అందిస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపిన ప్రకారం, దేశంలోనే తొలిసారిగా ఏపీలో రైతులకు 80% సబ్సిడీతో డ్రోన్లు ఇస్తున్నారు. రూ.9.80 లక్షల విలువ గల ఈ డ్రోన్ను రైతులు కేవలం రూ.1.96 లక్షలకే పొందొచ్చు. మిగతా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. పిచికారీ పనిలో డ్రోన్ల వాడకం వల్ల తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, అధిక స్థాయిలో పని పూర్తవుతుంది. డ్రోన్తో ఒక ఎకరం పొలం పిచికారీకి కేవలం 7 నిమిషాలు సరిపోతుంది. అంతేగాక, ఇది టార్గెట్ స్ప్రే చేస్తూ నీరు, మందులు వృథా కాకుండా చూస్తుంది.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 875 డ్రోన్లు రైతులకు పంపిణీ చేశారు. గ్రూపులుగా రైతులు కలిసొచ్చి కూడా డ్రోన్లు పొందవచ్చు. అవసరమైతే బ్యాంక్ రుణ సౌకర్యం కూడా ఉంది. డ్రోన్ ఆపరేట్ చేయడంలో అనుభవం లేని వారికి ప్రభుత్వం ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తోంది. డ్రోన్ తీసుకునే రైతులు ఇతరుల పొలాల్లో కూడా పిచికారీ చేసి ఆదాయం సంపాదించవచ్చు. డ్రోన్ వల్ల పురుగుమందుల ప్రభావం నుంచి మనుషులు దూరంగా ఉండటంతో ఆరోగ్య పరంగా కూడా లాభం. ఈ సబ్సిడీ డ్రోన్లను పొందేందుకు రైతు సంఘాలు లేదా మహిళా స్వయం సహాయక బృందాలు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, రైతు ID, బ్యాంక్ వివరాలు సమర్పించి గ్రూపుగా ఏర్పడిన తర్వాత డ్రోన్ మరియు ట్రైనింగ్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!
ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!
విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?
తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..
మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...
వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?
10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?
ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!
టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #APGovernment #SubsidyDrones #Achchennaidu #FarmersWelfare #DroneForFarming #SmartFarming #AndhraFarmers #AgricultureInnovation #NamoDroneDidi #TechInAgriculture #FarmersSupport #DroneSpraying #AgriSubsidy #APAgriDevelopment #DroneRevolution
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.